Thursday, April 18, 2024

మంత్రి బుగ్గ‌న చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే : మాజీ మంత్రి అయ్య‌న్న

రాష్ట్ర మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్నాన‌ని చెప్పిన ఏపీ సీఎం జగన్ లండ‌న్‌కు వెళ్లార‌ని, అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న‌ విమానంలో ఆయ‌న ప్ర‌యాణం కొన‌సాగింద‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే ఏపీ మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే, ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ అస‌త్యాలేన‌ని టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు చెప్పారు. జగన్ రెడ్డి లండన్ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడన్నారు. జగన్ రెడ్డికి ఫ్లైట్ పర్మిషన్ లేక లండన్ వెళ్లాడనేది పచ్చి అబద్ధమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement