Wednesday, April 24, 2024

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఉన్న‌త విద్యామండ‌లి ప్రకటన

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్‌ను ఈ నెల 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అలాగే ఎడ్‌ సెట్‌ ఏప్రిల్‌ 13న ఉదయం, లాసెట్‌/ పీజీఎల్‌ సెట్‌ 13వ తేదీ మధ్యాహ్నం, పీజీఈ సెట్‌ 18 నుంచి 21వ తేదీ వరకు, పాలిటెక్నిక్‌ నుంచి ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలోకి చేరడానికి నిర్వహించే ఈసెట్‌ 22న, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను 25న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement