Saturday, April 20, 2024

ముగిసిన ఎంఎల్‌సీ నామినేషన్‌లు..

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌): విశాఖ జిల్లాలో ఖాళీ అయిన రెండు ఎంఎల్‌సీ స్థానాలకు నలుగురు దరఖాస్తులను సమర్పించారు. అనకాపల్లి ఎంఎల్‌సీ బుద్ద నాగ జగదీశ్వరరావు స్థానంలో పోటీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున వరుద కళ్యాణి నామినేషన్‌ దాఖలు చేశారు. నాన్న‌ ఆమెకు పోటీగా పెందుర్తికి చెందిన షేక్‌ షఫీ ఉల్లా స్వంతంత్య్ర అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎంఎల్‌సీ పప్పల చలపతిరావు పదవీ విరమణ స్థానంలో జరిగే ఎన్నికల్లో చెన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీ కృష్ణ శ్రీనివాస్‌) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేసి ఉన్నారు.

అయితే, నిన్న‌ శ్రీముఖలింగం ప్రాంతంకు చెందిన నాయుడుగారి రాజశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వీరు స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. నిర్ధేశించిన నామినేషన్‌ ఉపసంహరణ తేదీ తరువాత కూడా వీరు బరిలో ఉంటే పోటీ జరుగుతుంది. లేదంటే వైకాపా తరపున నామినేషన్‌లు వేసిన వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement