Tuesday, April 23, 2024

ఏపీలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణపై బిడ్లు ఆహ్వానించిన ఆర్టీసీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలక్ట్రిక్​ బస్సులను ప్రొత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, 350 ఎలక్ట్రిక్​ బస్సులను నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ భావిస్తోంది. ఈ బస్సుల నిర్వహణకు బిడ్స్‌ ఆహ్వనించామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అయితే, విశాఖకు 100, విజయవాడ, కాకినాడలకు 50 చొప్పున ఎలక్ట్రిక్​ బస్సులను నడపాలని నిర్ణయించారు.
అమరావతి, తిరుపతి‌‌, తిరుమలకు 50 చొప్పున ఈ బస్సులను కేటాయించారు. వీటిని ఉపయోగించడం వలన 50 శాతం బ్యాటరీ ధరలు తగ్గడంతో పాటు, నిర్వహణ ఖర్చు కూడ తగ్గుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఎలక్ట్రిక్​ బస్సుల ప్రోత్సాహకానికి రూ. 55 లక్షలు అందించనుంది. ఈ బస్సుల నిర్వహణకు ఈ నెల 9వ తేదీ బిడ్స్‌ దాఖలు చేయడానికి చివరితేదీగా నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement