Friday, March 29, 2024

ప్రాణం తీసిన పందెం కోడి…

రాజ‌మండ్రి – సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. పందెం కోడి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఊర్లో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు పద్మారావు అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఇందులో ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో వెంటనే అత‌డిని ఆసుపత్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో మ‌ర‌ణించాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement