Wednesday, April 17, 2024

వామ్మో పులి..

కాకినాడ జిల్లా వాసులకు పులి భయం పట్టుకుంది. గత కొంతకాలంగా జిల్లాలో పులి సంచరిస్తున్నట్లు పలు చోట్ల ఆనవాళ్లు సైతం దొరికినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కుమ్మరి లోవ దగ్గర పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు ఆనవాళ్లు సేకరిస్తున్నారు. రౌతులపూడి అటవీ ప్రాంతం నుంచి తుని లోకి పులి ఎంటర్‌ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement