Thursday, April 25, 2024

తూర్పు గోదావరి జిల్లా చాగల్లు వద్ద ఉద్రిక్తత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చాగల్లు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర చాగల్లు చేరుకోగా.. అక్కడ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో డప్పు వాయిస్తూ మాజీ ఎమ్మెల్యే రామారావు నిరసన వ్యక్తం చేశారు. అయితే పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ప్రభుత్వం భయపడుతోందని రైతులు విమర్శించారు. కోర్టు అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. కావాలనే రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిని మూసివేసారని రైతులు ఆరోపించారు. కలెక్టర్ కు లెటర్ పెట్టినప్పటికీ స్పందించలేదని రైతులు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement