Thursday, April 25, 2024

ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు : మ‌హిళ మృతి

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందిన ఘ‌ట‌న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై చెందుర్తి-వజ్రకూటం మార్గమధ్యంలో ఈప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద ఘటనను గ్రహించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఆటోడ్రైవర్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement