Thursday, March 28, 2024

రోడ్డుప్రమాదం… స్పాట్ లోనే నలుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఆటో ట్రాలీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గండేపల్లి మండలం, మల్లెపల్లి గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ట్రాలీ తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement