Wednesday, April 24, 2024

ఎంపీడీవోను బెదిరించిన వైసీపీ నేత అరెస్ట్..

ఏపీలో అధికార వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఓ నేత ఎంపీడీవోను దూషించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్‌ విజయను దుర్భాషలాడిన వైసీపీ నేత, మాజీ సర్పంచ్ వాసంశెట్టి తాతాజీని.. తమ మాట వినకపోతే.. చీరేస్తాం అంటూ మహిళా అధికారిపై బెదిరింపులకు పాల్పడాడు. ఈ ఘటనపై సదరు మహిళా ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాజీ సర్పంచ్ వాసం శెట్టి తాతాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు.

మాజీ సర్పంచ్‌ తాతాజీ, అయినవిల్లి జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, కె. జగన్నాథపురం సర్పంచ్‌ భర్త మేడిశెట్టి శ్రీనివాస్‌, శంకరాయగూడెం మాజీ సర్పంచ్‌ కుడిపూడి రామకృష్ణ తమ మాట వినకపోతే చీరెస్తాం అంటూ ఎంపీడీవో విజయను బెదిరించారని పోలీసులు పేర్కొన్నారు. ఎంపీడీవో విజయ ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారిని అసభ్య పదజాలంతో దూషించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement