Thursday, April 25, 2024

Breaking: వీడిన మిస్ట‌రీ : ఐదుగురి మృతికి కార‌కుడైన వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 2వ‌తేదీన‌ కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మరణించారు. ఈ విషాద ఘటన రాజవొమ్మంగి మండలంలో చోటుచేసుకుంది. అయితే ఈ క‌ల్తీ కల్లు కేసులో మిస్ట‌రీ వీడింది. గ‌డ్డి మందు క‌లిపిన క‌ల్లు తాగ‌డంతో ఐదుగురు గిరిజ‌నులు మృతిచెందిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. నిందితుడు వంత‌ల రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలో జీలుగు క‌ల్లులో రాంబాబు గ‌డ్డి మందు క‌లిపాడు. మృతుడు గంగ‌రాజును టార్గెట్ చేసి నిందితుడు రాంబాబు క‌ల్లుతో గ‌డ్డి మందు క‌లిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement