Sunday, March 24, 2024

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి కొండలరావు రాజీనామా..

మామిడికుదురు ,ప్రభన్యూస్ : న‌గరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కొమ్ముల కొండలరావు తెలిపారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండలరావు మాట్లాడుతూ..పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు లేదని,ఇసుక ,మట్టి మాఫియాలను స్థానిక ప్రజాప్రతినిది ప్రోత్సహించడం వల్ల వైకాపా పై ప్రజల్లో చెడు అభిప్రాయం వ్యక్తం అవుతోందని అన్నారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావిస్తుంటే తన సోదరుడు, కొడుకులు, బామ్మర్ది ని కలవండి అంటూ ఎమ్మెల్యే చెప్పడం సరికాదన్నారు. నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులు ఎమ్మెల్యే తన అనుచరులుకి పోస్టింగ్ ఇచ్చి తనతో సంతకాలు చేయించుకోవడం తో మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.నియోజకవర్గంలో కొంతమంది పెద్ద నాయకులు ఇసుక,మట్టి ,వ్యాపారం చేస్తూ పార్టీ ప్రతిష్టాతను దెబ్బతిస్తున్న ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో తాను పార్టీ లో ఉండలేక రాజీనామా ప్రకటన చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement