Friday, April 26, 2024

టీడీపీలో నిరసన గళం!

ఏపీలో లో జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టిడిపి ఇన్‌ఛార్జ్‌గా మాత్రం కొనసాగుతానని చెప్పారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ ప్రకటించడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

కాగా , జ్యోతుల నెహ్రూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో టిడిపి తరఫున విజయం సాధించారు. 2014లో వైసిపి నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత నెహ్రూ మళ్లీ టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement