Tuesday, April 23, 2024

అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్ట్..

కాకినాడ : అంతర్ రాష్ట్ర నేరస్తులను పట్టుకున్నట్లు అడిషనల్ ఎస్ పి కె.కుమార్ , క్రైమ్ డిఎస్పి రాంబాబు, సిఐ గోవిందరావు తెలిపారు. కాకినాడ క్రైమ్ డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.. పాత నేరస్తులు పెద్దాపురం మండలంకి చెందిన ఎనయండ పల్లి సూరిబాబు, బిక్కవోలు చెందిన కస్తూరి అప్పన్న రాత్రి వేళలో ఇళ్ళల్లో దొంగత‌నాలు చేస్తున్నార‌న్నారు. ఆంధ్ర, తెలంగాణలో పలు దొంగతనాలు చేశారని వెల్ల‌డించారు.వారి వ‌ద్ద నుంచి 16 లక్షల విలువైన బంగారం నగదు స్వాధీనం చేసుకున్నామ‌ని వివ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement