Wednesday, March 27, 2024

మంట‌ల్లో ఆర్టీసీ ఇంద్ర బ‌స్సు – ప్ర‌యాణీకులు సుర‌క్షితం..

కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. కాకినాడ జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద బస్ ఇంజిన్‌లో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేశాడు..ప్రయాణీకులను అప్రమత్తం చేసి వారిని దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరో బస్సులో విజయవాడ‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement