Thursday, April 18, 2024

లారీ, బొలెరో వాహ‌నం ఢీ.. ముగ్గురు మృతి

కాకినాడ జిల్లా జాతీయ రహదారిపై ఘోర‌ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. తుని మండలం వెలమకొత్తూరు వద్ద లారీ, బొలెరో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి శ్రీరంగపట్నం వెళ్తున్న బొలెరో వాహనం ఆగిఉన్న లారీని ఢీ కొట్టడంతో బొలెరో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా తుని ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement