Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం

రాజమండ్రిఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో 1,537 ఓట్ల మెజార్టీతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం సాధించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పీఆర్టీయూ/ఎస్టీయూ బలపరిచిన అభ్యర్థి గంధం నారాయణరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న షేక్‌ సాబ్జి, చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌ల మధ్య గట్టి పోటి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రదానంగా షేక్‌ సాబ్జి, గంధం నారాయణరావు నువ్వా నేనా.. అనే రీతిలో పోటీ పడ్డారు. అంతిమంగా సాబ్జినే విజయం సాధించారు. షేక్ సాబ్జికి 7,983 ఓట్లు పోలవగా…. నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే సాబ్జీ విజయం ఖారారైందిి.

Advertisement

తాజా వార్తలు

Advertisement