Thursday, April 25, 2024

Breaking: ఈనెల 26 నుంచి అక్టోబ‌ర్ 6వర‌కు ద‌స‌రా సెల‌వులు.. 7 నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఇవ్వాల (మంగళవారం) దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 26వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 6వ తేదీ దాకా స్కూళ్ల‌కు సెల‌వులు ఇస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. 7వ తేదీన య‌థావిధిగా స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయ‌ని ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా క్రిష్టియ‌న్‌, మైనార్టీ స్కూళ్ల‌కు అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వ‌ర‌కు సెలువులు ఇస్తున్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేర‌కు విద్యాశాఖ నుంచి ఈ ఆదేశాలు వెలువ‌డ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement