Thursday, April 25, 2024

ఈ నెల 26నుండి అక్టోబ‌ర్6 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు-ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్

ఈ నెల 26నుండి అక్టోబ‌ర్ 6వ‌ర‌కు ద‌స‌రా సెల‌వుల‌ని ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. అయితే ఈ నెల 25న ఆదివారం కాబ‌ట్టి ఆ రోజు నుండే సెల‌వులు ప్రారంభం కానున్నాయి.అదే విధంగా వ‌చ్చే నెల (అక్టోబ‌ర్‌) 6 వ‌ర‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. అక్టోబ‌ర్ 7న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొత్తంగా 11 రోజుల పాటు పాఠశాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు ఇచ్చారు. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6 వరకు సెలవులు ఇస్తూ ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ పాఠ‌శాల‌లు కూడా ఇత‌ర‌త్రా పాఠ‌శాల‌ల మాదిరే అక్టోబ‌ర్ 7న పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఈ విద్యా సంవ‌త్స‌రంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలువులుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement