Tuesday, April 23, 2024

బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట.. మాడవీధుల్లో వాహన సేవలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలో రెండేళ్ళ తరువాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలను మాడవీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో అన్ని రకాల ప్రవిలేడ్జ్‌ దర్శనాలను రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్‌ దర్శనాలు, వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రవిలేడ్జ్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్దిత సేవలు రూ. 300 దర్శన టికెట్లతో పాటు శ్రీవాణిట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. అలాగే స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ విఐపిలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం.

ఇక గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్‌లైన్‌లో తిరుమలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్బోబర్‌ 1 న గరుడ సేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రస్టుల దాతలకు, కాటేజి దాతలకు ఈనెల 30 నుంచి అక్టోబర్‌ 2 వ తేది వరకు ఆన్‌లైన్‌లో గదుల కేటాయింపు ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టిటిడి కోరింది. అదేవిధంగా పవిత్రంగా భావించే పెరటాసి మాసంలో బ్రహ్మోత్సవాలు రానుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని, తిరుమలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా ఈ విషయాన్ని గమనించి భక్తులు తిరుపతిలో గదులు పొంది బస చేయాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement