Friday, April 19, 2024

Breaking | శ్రీశైలం ఆలయంపై డ్రోన్ చక్కర్లు.. బయటపడ్డ సెక్యూరిటీ వైఫల్యం

రాయలసీమ, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : నంద్యాల జిల్లా శ్రీశైలంలో సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. ఆలయ గోపురం మీదుగా శనివారం డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కాస్త సంచలనం మారడంతో హుటాహుటిన ఆలయ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆలయం మీదుగా డ్రోన్ల వంటి వాటిని ఎగరవేయడం నిషేధం. అట్లాంటి వాటని గుర్తించిన దేవస్దానం సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్ ను పట్టుకుని సీసీ కంట్రోల్ రూముకు తరలించారు. స్థానికంగా జరుగుతున్న ఓ పెళ్లి కోసం ఆ డ్రోన్ తెచ్చినట్లు సమాచారం. అయితే.. టెంపుల్​ అధికారుల అనుమతి తీసుకోవాలని తెలియక డ్రోన్ ఎగరేశారని స్థానికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement