Thursday, April 25, 2024

డ్రైవ‌ర్ మ‌ర్డ‌ర్ కేసు.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ, అరెస్ట్ కు రంగం సిద్ధం

డ్రైవ‌ర్ సుబ్రహ్మణ్యం ‎మ‌ర్డ‌ర్‌ కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కాగా, పోలీసుల‌కు దొర‌క్కుండా అనంత ఉదయ్‌భాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏదీ ఏమైనా ఇవాళ అనంత ఉదయ్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి నిన్న పోస్టుమార్టం పూర్తయ్యింది. ఎస్పీ ప్రెస్‌మీట్‌ తర్వాత మృతుడి భార్య‌ అపర్ణ పోస్టుమార్టంకి అంగీకరించింది. పెదపూడి మండలం జి.మామిడాలో ఇవాల‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement