Thursday, April 25, 2024

Breaking: చిరుతపై కుక్క‌ల వార్‌.. వెంట‌ప‌డి ఉరికిచ్చి ఉరికిచ్చి త‌రిమేశాయి..

అనంత‌పురం జిల్లా శెట్టూరు మండలం మల్లేపల్లిలో అద్భత ఘటన జరిగింది. సాధారణంగా చిరుతను చూస్తే ఏ ఇతర జంతువులైనా కాస్త భయపడుతుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం గొర్రెల మందకు కాపలాగా ఉన్న కుక్కలు చిరుత‌పులిని త‌రిమేసిన ఘ‌ట‌న జ‌రిగింది. కొన్ని రోజులుగా గొర్రెల మంద‌పై దాడులు చేసి జీవాలను చంపుకుతింటున్న చిరుతను కుక్క‌లు ఉరికిచ్చి ఉరకిచ్చి తరిమేశాయి.

కాపరుల సాయంతో ఈ కుక్కలు అటుగా వచ్చిన చిరుతపై తిరుగుబావుటా ఎగరేశాయి. దాన్ని దరిదాపుల్లోకి రాకుండా వెంటపడి వెంటపడి తరిమేశాయి. కుక్క‌లు వెంట‌ప‌డ‌డంతో ఆ చిరుత ప‌రుగులు తీస్తూ అడ‌విలోకి పారిపోయింది. ఈ ఘటన ఇప్పుడు అంతటా హాట్​ టాపిక్​గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement