Thursday, April 25, 2024

Breaking: డాక్టర్ల నిర్లక్ష్యం.. మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ లో వృద్ధురాలు మృతి

మాచర్ల, (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ లో దారునం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు చనిపోయిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక 20వ వార్డుకు చెందిన కొమ్ము అన్నమ్మ (70) అనారోగ్యంతో ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతో వైద్యం అందక చూస్తూ ఉండగానే ప్రాణాలు కోల్పోయింది. అన్నమ్మ బంధువులు ఆస్పత్రికి చేరుకొని వైద్యులపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ హాస్పటల్ లో పేదలకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని హాస్పిటల్​ సూపరింటెండెంట్​ రంగారావుకు ఫిర్యాదు చేశారు. ఆందోళన చేస్తున్న స్థలానికి పట్టణ ఎస్ఐ సంధ్యారాణి చేరుకొని వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement