Wednesday, April 24, 2024

Flash: రెస్టారెంట్ నిర్వాహకులపై ప్రభుత్వ వైద్యుడి దాడి

మద్యం మత్తులో ప్రభుత్వ వైద్యుడు రెస్టారెంట్ నిర్వాహకులపై దాడికి యత్నించిన సంఘటన గిద్దలూరులో చోటుచేసుకోంది. ఈ సంఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. రాచెర్ల మండలంలోని ఒక ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు మంగళవారం రాత్రి రెస్టారెంట్ కు వచ్చాడు. రెస్టారెంట్ లో పై దాబాలోకి వెళ్లేందుకు డాక్టర్ ప్రయత్నించగా నిర్వాహలు అడ్దుకున్నారు. పై దాబాలో ఫ్యామిలికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఈ విషయమై డాక్టరుకు నిర్వాహకుల మధ్య వివాదం జరిగింది. అక్కడి నుండి వెళ్లిపోయిన డాక్టర్ కొద్దిసేపటి తరువాత కొందరిలో వచ్చి మద్యం మత్తులో నిర్వాహకులతో ఘర్షణ పడి రెస్టారెంట్ లోని వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకొని నిర్వాహకులపై దాడికి యత్నించాడు. అయితే, సిబ్బంది చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ దాడి దృశ్యాలు రెస్టారెంట్ లోని సిసి కెమెరాకు చిక్కాయి. దాడి ఘటన పై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement