Wednesday, April 24, 2024

ఉత్తమ ఎన్నికల నిర్వహణాధికారిగా జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి

విజయనగరం, (ప్రభన్యూస్‌) : రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణాధికారిగా జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న గవర్నర్‌ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఆమె అందుకోనున్నారు. జిల్లా కలెక్టర్‌గా వచ్చిన కొద్ది కాలంలోనే పాలనపై తనదైన ముద్ర వేసిన సూర్యకుమారి, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతిపధాన నడిపిస్తున్నారు. ఆమె హయాంలో ఇటీవలే జిల్లాకు రెండు స్కోచ్‌ పురస్కారాలను సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 2021 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణాధికారిగా ఆమె ఎంపిక కావడంతో, జిల్లా ఖ్యాతి మరింత ఇనుమడించింది.

ఆరు నెలల క్రితం జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియంలో ఆమె వినూత్న పద్దతులను అనుసరిస్తూ, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేసారు. ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన కొత్తవారికి ఓటుహక్కు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, యువ ఓటర్లను చైతన్యపరిచారు. ఇటీవలే సవరించిన ఓటర్ల జాబితాల ముద్రణ కూడా పూర్తి చేసారు. దీంతో ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ పద్దతులను అవలంభించి సకాలంలో పూర్తి చేసినందుకు గాను, ఉత్తమ ఎన్నికల నిర్వహణాధికారిగా పురస్కారం వరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement