తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. మొన్నటి వరకూ 30 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. మంగళవారం 23,744 మంది భక్తులు మాత్రమే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 12,057 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital