Thursday, April 18, 2024

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.. పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…అవసరమైతే పదిసార్లు మాట్లాడుకుంటామని, అందరినీ కలుపుకుని పోతామన్నారు. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశం కాదన్నారు. కలిసి పోరాడే అంశాలపై ఇంకా చర్చించలేదన్నారు. పార్టీలు నడిపే వారి గొంతునొక్కాలని చూస్తున్నారన్నారు. తమ మిత్రపక్షం బీజేపీ నేతలపై కూడా కేసులు పెట్టారన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాటం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement