Friday, April 19, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి చెందిన సంఘతన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని చెన్నై -కలకత్తా జాతీయ రహదారిపై తెట్టు దగ్గర గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం చుక్కల దుప్పిని ఢీకొట్టింది. దీంతో దుప్పి అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన దుప్పి వయసు 4 సంవత్సరాలు ఉంటుందని బీట్ ఆఫీసర్ చిరంజీవి తెలిపారు.  తెట్టు వైద్యాధికారి విజయ భాస్కర్ రెడ్డి పంచనామా జరిపి అనంతరం ఖననం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement