Thursday, April 18, 2024

బద్వేలు వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ

ఏపీలోని బద్వేలు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ ఈసీ విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీ చేయన్నారు. ఈ మేరకు ఏపీ​ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.   ఈ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని, మంచి మెజార్టీతో గెలుస్తామని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీకి అభిమానం పెరుగుతోందన్నారు. ప్రజల అభిమానం, ఆదరణ తమ పార్టీకి ఎప్పుడూ ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు.

కాగా, హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 30న ఉప ఎన్నికల జరగనుండగా.. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 

ఇది కూడా చదవండి: పాడైన రోడ్లకు మరమ్మతులు.. శ్రమదానం చేయనున్న పవన్ కల్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement