Wednesday, March 27, 2024

తుఫాన్ ఎఫెక్ట్ : విశాఖకు విమానాలు రద్దు

ఆసని తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు రైళ్లు రద్దు కాగా… విశాఖపట్నం నుంచి విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. దీంతో ఇండిగో సంస్థకు చెందిన విశాఖ వచ్చే 22 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లే మరో 22 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు నుంచి రావాల్సిన ఎయిరేషియా విమాన సర్వీసులు సైతం రద్దయ్యాయి. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగానే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement