Friday, April 19, 2024

అధికారాలు లేకుండా చేయడమే వికేంద్రీకరణా?: సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ

పంచాయతీ సర్పంచ్ ల అధికారాల, నిధులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. సర్పంచ్ లకు నిధులు, విధులు లేకుండా చేస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సరికాదని తెలిపారు.

సర్పంచ్ లకు అధికారాలు లేకుండా చేయడమే అధికార వికేంద్రీకరణా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల నిధులు రూ.3,450 కోట్లు తిరిగివ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పంచాయతీలకు నిధుల విడుదలు చేయాలని రాష్ట్రంలోని సర్పంచ్ లు ఆందోళనకు సిద్ధమవుతున్నారని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement