Thursday, April 25, 2024

ప్రజా పాదయాత్రకు మద్దతివ్వండి: సిపిఐ రామకృష్ణ

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రను ఆదరించాలని  రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతులు, మహిళల రెండేళ్ల చారిత్రక ఉద్యమానికి మహా పాదయాత్ర మరో మైలురాయన్నారు. 45 రోజుల పాటు జరిగే మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని  రామకృష్ణ డిమాండ్ చేశారు. 

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు తమ పోరు ఉద్ధృతం చేస్తున్నారు. 684 రోజులుగా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. నేటి నుంచి ప్రజా పాదయాత్ర చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement