Thursday, April 25, 2024

ఘనంగా సీపీఐ పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవం

కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని భాస్కరాపురం గ్రామంలో సీపీఐ 97 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భాస్కరాపురం గ్రామంలో సిపిఐ జెండా ఆవిష్కరణ చేసి, మిఠాయిలు పంచి సంబరాలు చేశారు సీపీఐ తాలూక కార్యదర్శి రమేష్ బాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పరిస్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్న పార్టీ సీపీఐ అని చెప్పారు. గత 97 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసిన ఘనత తమ పార్టీలదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీనువాసులు, సురేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement