Friday, April 19, 2024

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా కోవిడ్‌ కేర్‌..

కోవిడ్‌ బాధితులకు ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవల ప్రక్రియను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రారంభించింది. తొలి రోజైన గురువారం 360 మంది కోవిడ్‌ బాధితులకు జూమ్‌ కాల్‌ ద్వారా డాక్టర్లు వైద్య సహాయం అందించారు. రెండు గంటల పాటు-జరిగిన జూమ్‌ మీటింగ్‌ ద్వారా బాధితులు డాక్టర్ల నుంచి పలు సూచనలు పొందారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు ఆధారంగా డాక్టర్లు మందులు సూచించారు. కొందరు రోగులకు వివిధ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య సేవలతో పాటు- పలు చోట్ల రోగులకు మందులు పంపిణీ చేశారు. కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా.. శుక్రవారం నుంచి రోజుకు 1000 మందికి టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

తెలుగు దేశం పార్టీ వర్గాల ద్వారా జూమ్‌ కాన్ఫరెన్స్‌ లింక్‌ను ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేశారు. రోజూ ఉదయం 7.30 గంటల నుంచి టెలిమెడిసిన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవలకు కొందరు తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం అధ్యక్షులు జెడ్‌ శివప్రసాద్‌ 5 వేల మందికి మందులు అందించేందుకు ముందుకు వచ్చారు. తొలి రోజు కోవిడ్‌ రోగులకు అందిన సహాయంపై ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి రివ్యూ చేశారు. అదనంగా డాక్టర్లు, సిబ్బందిని నియమించుకుని ఎక్కువ మంది రోగులకు సహాయ పడేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆమె ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement