Friday, March 29, 2024

Covid-19: ఏపీలో కొత్తగా 186 కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 32,036 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 186 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గత 24 గంటల్లో 191 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,73,576కి చేరింది. ఇందులో 20,56,979 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,149 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివ రకు 14,448 మంది కరోనాతో మృతి చెందారు. నేటి వరకు రాష్ట్రంలో 3,05,39,041 సాంపిల్స్ ని పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement