Thursday, April 18, 2024

వైసిపి ఎమ్మెల్యే కాకాణిపై కేసు ఎత్తివేతకు నిరాకరించిన కోర్టు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్​రెడ్డిపై కేసు ఎత్తివేతకు విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది.

హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదంటూ గత నెలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో కేసు ఎత్తివేతకు అనుమతించబోమని స్పష్టం చేసింది. పిటిషన్​కు విచారణ అర్హత లేదని తెలిపింది. ­ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డిపై కేసు ఉపసంహరణకు అనుమతించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసిన పిటిషన్​ను వెనక్కి ఇచ్చేసింది.
తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాలు సృష్టించి మోసం చేశారంటూ తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో…గతంలో గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement