Thursday, April 25, 2024

సింగిల్‌ డిజిట్‌లో కరోనా.. గడిచిన 24 గంటల్లో 5 కేసులు నమోదు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా సింగిల్‌ డిజిట్‌కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8,219 మందిని పరీక్షించగా కేవలం ఐదుగురికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. 37 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈస్ట్‌ గోదావరిలో 1, వైఎస్‌ఆర్‌ కడపలో 1, కృష్ణాలో 2, విజయనగరంలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, వెస్ట్‌ గోదావరి జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు 3కోట్ల 34 లక్షల 15 వేల 605 శాంపిల్స్‌ ను పరిశీలించగా 23,19,509 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23,04,465 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 314 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement