Thursday, March 28, 2024

లీడ‌ర్లకు క‌రోనా.. ఏపీలో ఇద్ద‌రు వైసీపీ ఎంపీల‌కు పాజిటివ్‌..

క‌రోనా బారిన పడుతున్న లీడ‌ర్ల‌ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఏపీ మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వంటి నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా అదే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కరోనా సోకింది. వంగా గీత పీఏ, ఆమె గన్ మెన్ కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

కాగా, మరోవైపు దేశంలో మొన్నటి దాకా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ రాకతో మళ్లీ స్పీడందుకున్నాయి. రోజు రోజుకూ పాజిటివ్ బాధితులు పెరుగుతూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో సామాన్యులతో పాటు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ మ‌ధ్య‌నే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ కు కూడా కరోనా సోకిన విష‌యం సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ప‌ది రోజులు ఎవ‌రినీ న‌మ్మొద్ద‌ని, క‌రోనా పీక్స్ చేరే చాన్స్ ఉంద‌ని.. అంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement