Friday, April 19, 2024

ఏపీలో మళ్లీ విజృంభించిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,209 కరోనా కేసులు నమోదు కాగా.. 22 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,896 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 20,593గా నమోదయ్యాయి.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,76,141కు చేరింది. కరోనాతో మొత్తం 13,468 మంది మరణించారు. కరోనాతో కృష్ణాజిల్లాలో ఆరుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు.  చిత్తూరు జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు సంఖ్య ఇలాగే కొనసాగితే.. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్య శాఖ సూచించింది.

ఇది కూడా చదవండి: మీరాభాయ్ చానుకి మోదీ సహాయం: రహస్యం బయటపెట్టిన మణిపూర్ సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement