Tuesday, April 23, 2024

ఏపీలో కరోనా టెర్రర్: భారీగా నమోదైన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,178 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,367 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 14 మంది మృతి చెందారు. అదే సమయంలో 1248 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,34,786కి చేరగా.. ఇందులో 2006034 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 14044కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కోవిడ్ తో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున కృష్ణ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఇది కూడా చదవండి: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్

Advertisement

తాజా వార్తలు

Advertisement