Thursday, April 18, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

పెరుగుతున్న కరోనా కేసులు ఎఫెక్టు వెంకన్న ఆలయాకి వచ్చే భక్తుల పై పడింది. మొన్నటివరకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు, ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. సాధారణ సమయాల్లో నిత్యం దాదాపు 60 వేల మంది భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్లు మూతపడిన ఆలయం, తిరిగి తెరచుకుని రోజుకు 50 వేల మందికి స్వామి దర్శనం కల్పించినప్పటికీ, ఇటీవలి కాలంలో పెరుగుతున్న కేసులు, మరోమారు ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. గురువారం నాడు స్వామివారిని కేవలం 16,412 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 1.98 కోట్ల ఆదాయం వచ్చిందని, 7,974 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement