Friday, March 29, 2024

ఏపీలో కొత్తగా 6,770 మందికి కరోనా.. మరణాలు ఎన్నంటే..

కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో విలవిలాడిన ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 1,02,876 మందికి పరీక్షలు చేయగా.. 6,770 మందికి పాజిటివ్​గా తేలింది. మహమ్మారి సోకి మరో 58 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12మంది మృతి చెందారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,199,  చిత్తూరు జిల్లాలో 968  కరోనా కేసులు నమోదవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 765, ప్రకాశం జిల్లాలో 530 కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 12,492 మంది కోలుకోగా.. ప్రస్తుతం 85,637 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం పాటిజివ్ కేసుల సంఖ్య 1806949కి చేరింది. వైరస్ కారణంగా మొత్తం 11940 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement