Friday, March 29, 2024

కంటైనర్, ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు మృతి..

బాపట్ల టౌన్ జనవరి23(ప్రభన్యూస్) రోడ్డు ప్రమాదంలో లారీ,ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వెదుళ్ళపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాపట్ల వైపు నుండి చీరాల వైపుకు వెళ్తున్న కంటైనర్ లారీ, మురుకుండాపాడుకు చెందిన ఉక్కుమల్లి మరియారావు(25)ద్విచక్ర వాహనం పై మురుకుండపాడు రోడ్డువైపు నుంచి వెదుళ్లపల్లి మెయిన్ రోడ్డుకు వచ్చిన సమయంలో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వాహనదారుడి తలకు బలమైన గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.

తమ గ్రామ వాసి రోడ్డు ప్రమాదంలో చనిపోయడని తెలుసుకున్న గ్రామస్తులు గంట సేపు హైవేపై మృతుడు కుటంబానికి తక్షణమే న్యాయం చేయాలని ధర్నా చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చెరుకుని మృతుడు బంధువులకు సర్ది చెప్పి ధర్నా విరమింప చేశారు.రోడ్డు ప్రమాదంపై వెదుళ్లపల్లి యస్ఐ జనార్దన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.హైవే రోడ్డు నుండి ఇతర గ్రామాలకు వెళ్లే రహదారులకు స్పీడ్ బేకర్లు వేస్తే కొంత మేర రోడ్డు ప్రమాదలు నివరించవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement