Friday, April 26, 2024

వైద్యుడికి నాన్ బెయిలబుల్ వారెంట్

క‌ర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వైద్యుడు డాక్టర్ విశ్వరూపాచారికి వినియోగదారుల కమిషన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ రోగికి వైద్య సేవల్లో లోపంతో రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని గతంలో జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పు ఇచ్చింది. డాక్టర్ ఆ పరిహారం చెల్లించకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement