Thursday, April 25, 2024

రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ దిగ్భ్రాంతి

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, రోశయ్య మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. అనేక మంది రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. అవినీతి మచ్చలేని నిఖార్సయిన రాజకీయ నేత రోశయ్య అని కొనియాడారు. 16 సార్లు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్యది అని చెప్పారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement