Saturday, April 20, 2024

ఏపీ సీఐడీ ఏడీజీపై చర్యలు తీసుకోండి: కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై లీగల్‌ రైట్స్‌ అడ్వైజరీ(ఎల్‌ఆర్‌వో) కన్వీనర్‌ వినయ్ జోషి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. సునీల్‌ కుమార్‌ పోలీస్ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. కుల, మత విభేదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో వినయ్‌జోషి పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో సునీల్‌కుమార్‌ ప్రసంగాలు చేసిన వీడియో లింకులు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ పోస్టులను ఫిర్యాదులతో జతపరిచారు.

ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్‌ పొంది… క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్‌ను సర్వీస్‌ నుంచి తప్పించాలన్నారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‌ను వదలుకోవాలన్న… మద్రాస్‌ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement