Saturday, April 20, 2024

Nellore: బురదలో చెప్పులు లేకుండా నడిచిన కలెక్టర్

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తి పాలెం రాజీవ్ కాలనీలో వరదల ధాటికి పూర్తిగా నష్టపోయింది. ఈ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు శనివారం పర్యటించారు. ఓ వైపు బురదమయం…అడుగుతీసి అడుగు వెయ్యాలన్న జారి పడిపోతున్న పరిస్థితి.  సుమారు గంటకు పైగా ముదివర్తి పాలెంలో జిల్లా కలెక్టర్ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement