Tuesday, April 23, 2024

సీఎం ప్రకటన హైకోర్టు ధిక్కరణే … పయ్యావుల కేశవ్

సీఎం జగన్ ప్రకటన హైకోర్టు ధిక్కరణే అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు చెప్పిందన్న పయ్యావుల ఏపీ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని వెల్లడించారు. ఇటువంటి సమయంలో సీఎం ప్రకటన హైకోర్టును ధిక్కరించడమే అవుతుందని పయ్యావుల మండిపడ్డారు. విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలున్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం కావడంతో విశాఖ రాజధాని కాబోతుందంటూ సీఎం జగన్ ప్రకటన చేశారని విమర్శించారు. ఎంపీ కాల్ డేటా వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టి మళ్లించే కుట్రలని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement