Tuesday, April 16, 2024

పోలవరంలో సీఎం జగన్.. ప్రాజెక్ట్ పరిశీలన

పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం చేరుకున్నారు. ముందుగా సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్‌ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.  సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement